ప్రతిఘటన, నాగర్ కర్నూల్ బ్యూరో ప్రతినిధి విజయ్ కాంత్
బిజినపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షునిగా నరసింహా యాదవ్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ యాదవ్, సంఘ సభ్యులుగా కొంగరీ రాములు, జాలం శ్రీనివాస్, సల్ల నాగయ్య, ఆపల్లి సత్తయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు, సభ్యులను ఆర్య కటిక సంఘం తరఫున కటిక శ్రీనివాసులు వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. సంఘ సభ్యులు సామాజిక చైతన్యంతో సమాజానికి సేవ చేయాలని కోరారు.
