prathighatana.com
Newspaper Banner
Date of Publish : 17 February 2026, 2:19 pm Digital Edition : PRATHI GHATANA

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

ప్రతిఘటన చాంద్రాయణగుట్ట రిపోర్టర్ శైలేష్ కుమార్

ఛత్రినాక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పూల్ బాగ్ క్రీడా మైదానంలో మంగళవారం ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్స్ అవగాహన కార్యక్రమంలో
మొబైల్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని సెక్టార్ ఎస్ఐ లు స్వప్న , అఖిల్ సూచించారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు 1930 కి కాల్ చేయాలని లేదా పోలీసుస్టేషన్ కి నిర్భయంగా వెళ్లి ఫిర్యాదు చేయాలనే విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు బస్తీ వాసులు సిబ్బంది నవీన్, హెచ్ సీ హమీద్, ముబీన్ పాల్గొన్నారు.