యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతిఘటన బ్యూరో రిపోర్టర్ జంగిటి రవీందర్
మండలంలోని తుక్కపురం గ్రామం నుండి గౌస్ నగర్ వెళ్లే దారిలో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తొలగించారు. భువనగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ -I శీతాకాల ప్రత్యేక శిబిరం 4వ రోజు సోమవారం రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ జనగాం పాండు, ఉపసర్పంచ్ రాసాల లింగస్వామి యాదవ్, గ్రామ కార్యదర్శి లోకేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ తోటకూరి రామకృష్ణ, ఎన్ఎస్ఎస్ యూనిట్ – I వాలంటీర్స్ పాల్గొన్నారు.
