ప్రతిఘటన, ఎల్బీనగర్:
లింగోజిగూడ డివిజన్ అభివృద్ధి శిల్పి దర్పల్లి రాజశేఖర్ రెడ్డి రాజకీయ రంగంలో నిత్యం ప్రజాసేవలో ముందుండగా, ఆయన కుమారుడు త్రిషంక్ దర్పల్లి ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ లో 99.72% పర్సంటేజీ సాధించి కుటుంబానికి, లింగోజిగూడ డివిజన్కు గర్వకారణంగా నిలిచారని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ప్రవీణ్ రెడ్డి కొనియాడారు.

తండ్రి ప్రజాసేవలో ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి పనులతో ప్రజల మనసులు గెలుచుకుంటే, కుమారుడు చదువుల్లో క్రమశిక్షణ, పట్టుదలతో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలవడం నిజంగా స్ఫూర్తిదాయకమన్నారు
*రాజకీయాల్లో తండ్రి – చదువుల్లో కుమారుడు టాప్*
అన్న నానుడి ఈ సందర్భానికి అచ్చంగా సరిపోతుందని, ఈ గొప్ప విజయానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రవీణ్ రెడ్డి ఆకాంక్షించారు.
