prathighatana.com
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 6:55 am Digital Edition : PRATHI GHATANA

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్

ప్రతిఘటన, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య

ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో 1200 ఎకరాలు కోల్పోతున్న రైతులను పరామర్శించడానికి వెళ్తున్న సమయంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పరిగి భూ బాధితులకు సంఘీభావం తెలపడానికి వెళ్తున్న ఆమెను అడ్డుకోవడంపై తీవ్ర ఆగ్రహం చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందిస్తూ “ఎన్ని అరెస్టులు చేసినా ఎంత మందిని అడ్డుకున్నా..” భూ బాధితుల పక్షాన పోరాటం ఆగదన్నారు. వారికి న్యాయం జరిగే వరకు తమ పూర్తి సహాయ సహకారాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.