prathighatana.com
Newspaper Banner
Date of Publish : 06 April 2026, 3:18 pm Digital Edition : PRATHI GHATANA

మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని పరిశీలించిన చైర్మన్

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జంగిటి రవీందర్

భువనగిరి పట్టణంలోని స్థానిక జగదేవపూర్ చౌరస్తా వద్ద గల మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం చైర్ పర్సన్, తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. బీసీ సంఘాల నాయకులు చేసిన అభ్యర్థన మేరకు పరిశీలించడం జరిగిందన్నారు. మహనీయుల జయంతుల కార్యక్రమాలకు అన్ని విధాలుగా పూర్తి ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, బీసీ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.