ప్రతిఘటన, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జీహెచ్ఎంసీ మీర్ పేట్ కార్పొరేషన్ క్లస్టర్ వన్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్కి బాత్ ప్రోగ్రాం లో పాల్గొని వారి ప్రసంగాన్ని ఎస్.ఎల్.ఎన్.ఎస్ కాలనీ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ బీజేపీ పార్టీ ఆఫీసులో వీక్షించారు. అలాగే పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం గురించి దిశా నిర్దేశాలు చర్చించి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ రాష్ట్ర జిల్లా మండల కార్పొరేషన్ నాయకులు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
