ePaper
Friday, April 3, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణహైదరాబాద్పూల్ బాగ్ చమన్ సమీపంలో చలివేంద్రం ప్రారంభం

పూల్ బాగ్ చమన్ సమీపంలో చలివేంద్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

ప్రతిఘటన, హైదరాబాద్ బ్యూరో

వేసవి వేడి తీవ్రత పెరగడంతో నగరంలోని ప్రజలకు కూడా ఇబ్బందులు పెరిగాయి. లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన గంగం సతీష్ , ఎన్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు పూల్ బాగ్ చమన్ సమీపంలో చలివేంద్ర ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా నార్కెట్ పల్లి శైలేష్ కుమార్ హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి శిబిరాలు ప్రభుత్వ, స్వచ్ఛంద, ప్రజల భాగస్వామ్యంతో శాశ్వతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సతీష్, కాపర్తి శ్రీనివాస్, వడ్డేపల్లి రాజు, ఠాకూర్ రాకెష్ సింగ్, శ్రీరాములు, ఎన్ మహేష్ కుమార్, జిల్లా రాఘవేందర్, వరలక్ష్మి, నర్సింగ్ రావు, అనురాధ, అంజలి, అడ్వకేట్ కనకరాజు, సిద్ధేశ్వర్ చారి, కృష్ణ, లక్ష్మణ్, కుమార్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!