prathighatana.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 4:59 am Digital Edition : PRATHI GHATANA

చెట్టును ఢీకొని వ్యక్తి మృతి

ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్

చెట్టును ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన భువనగిరి పగిడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని 6వ వార్డు హనుమాన్ వాడకు చెందిన మోతే శ్రీరాములు (35) పగిడిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న చెట్టుకు తన బైక్ పై వస్తూ ప్రమాదవశాత్తు ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీరాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.