prathighatana.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 1:54 pm Digital Edition : PRATHI GHATANA

చత్రపతి శివాజీ స్పూర్తి తో పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

ప్రతిఘటన, మహేశ్వరం రిపోర్టర్ ముత్తయ్య

చత్రపతి శివాజీ స్పూర్తి తో పోరాటాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోలన్ శంకర్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ని , కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ని పోలీసులు అడ్డుకొని హౌస్ అరెస్టు చేసి నిర్బంధించారని తెలుసుకొని శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వారి ఇంటికి వెళ్లి రాష్ట్ర చీఫ్ రామచందర్ రావ్ ని సంఘటన విషయాలు అడిగి తెలుసుకున్నారు . వారితో పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై చత్రపతి శివాజీ స్పూర్తి తో పోరాటాలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అని విజ్ఞప్తి చేసి ” శాలువాతో సత్కరించి, హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ విగ్రహాని భాహుకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామిడి మహేందర్ రెడ్డి, మునగాల ప్రభాకర్ రెడ్డి, పెద్దింటి సుధాకర్, లక్ష్మణ్ రాజ్ బాస్కర్, ప్రదీప్ పాల్గొన్నారు.