ప్రతిఘటన, యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జంగిటి రవీందర్
నూతనంగా ఎన్నికైన 7వ వార్డు కౌన్సిలర్ కుక్కుదుగు పద్మావతిని శ్రీ పెద్దమ్మ తల్లి పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం భువనగిరి పట్టణం కిసాన్ నగర్ లోని శ్రీ శ్రీ పెద్దమ్మ దేవాలయం ఆలయంలో శాలువ పుష్పగుచ్చాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ముందుగా ఆమె అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరపతి సంఘం సభ్యులు ఈర్ల వెంకటేష్, లింగాల బిక్షపతి, కుక్కదుగ సోమయ్య, తుపాకుల శ్రీనివాస్ కొలుపుల వివేకనంద, కుక్కదూగ కృష్ణ కృష్ణ తుపాకుల సురేష్, జంగిటి రవీందర్, కుశంగల నరసింహ, మేడబోయిన కుమార్ తదితరులు పాల్గొన్నారు.