ప్రతిఘటన , మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
జల్ పల్లి డివిజన్ కేంద్రంలోని శ్రీ శివ రామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. జల్ పల్లి ప్రజలు, భక్తులు వచ్చి కళ్యాణోత్సవం కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం ఏర్పడింది. వేద బ్రాహ్మణుల మంత్రోఛ్ఛరణాల మధ్య కళ్యాణోత్సవాన్ని ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. అనంతరం జల్ పల్లి డివిజన్ కేంద్రంలోని శ్రీరామ ఫిష్ సొసైటీ ఆధ్వర్యంలో.. విచ్చేసిన భక్తుల అందరికీ అన్నం లేదనకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, వివిధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.