ప్రతిఘటన మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
తుక్కుగూడ జిహెచ్ఎంసి పరిధిలోని రావిర్యాల సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఆలయానికి మంగళవారం భక్తులు బారులుతీరారు. అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, బోనం నైవేద్యం సమర్పించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేశారు. అనంతరం భక్తులకు అన్న దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ ఆలయ చైర్మన్ రెడ్డిగళ్ల రత్నం, దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.